రాతలు – కోతలు

జూన్ 27, 2009

తీవ్రవాదం-పరిచయసభ విశేషాలు!

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 5:44 అపరాహ్నం

అనుకున్నట్టుగానే తీవ్రవాద పుస్తక పరిచయ సభ త్యాగరాయ గానసభలో ఈవేళ సాయంత్రం జరిగింది. ఎంబీయస్ ప్రసాద్ గారు, రాధశ్రీ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. హాసం సభ్యుల హాస్యకథల నడుమ తీవ్రవాదం పుస్తకాన్ని గుడిపాటి గారు పరిచయం చేశారు. వల్లీశ్వర్ గారు విశ్లేషించారు. నేను స్పందించాను. ఆ వివరాలన్నీ ఫోటోల్లో చూడవచ్చు.

ఈ సభలో మన బ్లాగర్లు, తురుపుముక్క మురళీమోహన్, పర్ణశాల కత్తి మహేష్ కుమార్, అరుణం అరుణలు కూడా వచ్చారు.

ప్రథమంగా నాపై, ఈ పుస్తకం పేరును కలిపి రాధశ్రీ గారొక కంద పద్యం చదివారు. ఆ పద్యం ఇది;

కుస్మములవంటి బ్రతుకులు
మసియై వసివాడుచుండ- మంచి మనసుతో
పసగల మురళీ కృష్ణుడు
ప్రసరించెను దృష్టి తీవ్రవాదము పైనన్.

ఫోటోలు చూడండి.DSC00011

 

DSC00013

 

 

DSC00017

 

 

 

DSC00015

WordPress.com లో Blog పెట్టుము.