ముందు ప్రకటించినట్టుగా, నిన్న సాయంత్రం, ఏ ఎస్ రావ్ నగర్ లో తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ జరిగింది.
కోకిలం సంస్థ ఆధ్వర్యంలో ఈ సభలో శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా అద్దేపల్లి రామ మోహన్ రావుగారు, గుర్రం కొండ శ్రీకాంత్ గార్లు ప్రసంగించారు.
మధ్యలో పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకాన్ని అమ్మ ఆవిష్కరించింది.
సభ పొర్తయిన తరువాత, మన బ్లాగ్మితృడు ఆచార్య ఫణీంద్ర గారు వారి సతీమణితో వచ్చి కలవటం అత్యంత ఆనందం కలిగించింది.
సభ విశేషాలు మాటల కన్నా బొమ్మలే బాగా చెప్తాయి.





