రాతలు – కోతలు

నవంబరు 23, 2008

సినిమాలు చూడవద్దని బ్రహ్మబుధ్ కు ఎవరయినా చెప్పండి బాబో!

ప్రచురించిన వర్గము sinemaa vishleashaNaa. — కస్తూరి మురళీకృష్ణ @ 2:47 అపరాహ్నం

బ్రహ్మ బుధ్ కు మన తెలుగు సినిమాలు బాగా వంట పట్టినట్టున్నాయి. చక చకా సినిమాలు చూసేస్తున్నాడు. వాడు సినిమాలు చూస్తే నాకు అభ్యంతరం లేదు. సినిమాలు చూసినవెంటనే నా మెదడులోకి దూరి తలుపులు తన్ని మరీ సందేహాలతో నన్ను చంపుతున్నాడు. సినిమా కథలు వినిపించి, తన విష్లేషణలు తెలిపి చితకబాదుతున్నాడు.

మొన్న ఏదో ఆధ్యాత్మిక భక్తి సినిమా చూశాడట. అంతా వీరుడి మయం, జగమంతా వీరుడి భయం, అని పాడుతూ నన్ను నిద్రలేపాడు. బ్రహ్మ బుధ్ కలిసినప్పటినుంచీ నేను నిద్రపట్టని వ్యాధితో బాహపడుతున్నాను. ఏ సినిమా చూసి ఏ వైపునుంచి వచ్చి చంపుతాడో అన్న భయంతో నిద్ర పట్టటం లేదు. నిద్ర పట్టగానే ప్రత్యక్షమై సినిమా కథలతో నరకం చూపుతున్నాడు.

అందుకే, వాడి పాట వినగానే ఉలిక్కి పడి లేచా. పక పకా నవ్వాడు. ఇప్పుడే వీర భయంకర చిత్ర రాజాన్ని చూశావు? అడిగా భయంగా.

కథ చెపుతా కథ చెపుతా, కథ చెప్పి చెప్పి నిన్ను చంపుతా అంటూ పద్మాసనం వేసుకుని ధ్యాన ముద్రలో కూచున్నాడు.

కాస్సేపటికి గంభీరంగా కళ్ళు తెరిచాడు. కథ చెప్పటం ఆరంభించాడు.

అనగనగా ఒక బ్రహ్మాండమయిన హీరో. ఆ హీరోకొక దుబారా తండ్రి. అందరికీ అన్నాలు పెట్టి ఇల్లు గుల్ల చేస్తూంటాడు. మన వీరుడు, తల్లి బాధ పడుతూంటే లాజిక్ లటుక్కున చచ్చిపోయే ప్రశ్నలడిగి ఆమెకు బుద్ధి చెప్తూంటాడు. మన హీరోకి ఒక మరదలుంటుంది. ఆ మరదలికి ఒక తండ్రి వుంటాడు. వాడు పిచ్చివాడు. వాడికి పిచ్చి శిష్యులుంటారు.

పిచ్చి నేర్పుతారు కూడానా? బుద్ధిగడ్డితిని అడిగా.

మీ నాగరికతలో బ్రాహ్మణులను తెలివైన వారని గౌరవించేవారట కదా? అడిగాడు.

తలవూపా.

ఈ సినిమా చూస్తే అది తప్పు అని అర్ధమయిపోతుంది. గురువుకేమీ రాదు. కనీసం బంధుత్వాలూ తెలియవు. శిష్యులతడిని గౌరవించరు. హేళన చేస్తారు. వెక్కిరిస్తారు. చులకన చేస్తారు. అయినా ఆ తుచ్చ కూష్మాండ పండిత వేష ధారి తన పిచ్చినే పాండిత్యమని భ్రమపెడుతూంటాడు. మన వీరుడు గొప్పగా బుద్ధి చెప్తాడనుకో, అని నవాడు.

ఎలా బుద్ధి చెప్తాడని అడిగే ధైర్యం చేయలేక పోయా.

బ్రహ్మణులు బుద్ధిహీనులు, జోకర్లు అన్న నా సిద్ధాంతాన్ని నిరూపిస్తూ ఇంకొన్ని పాత్రలున్నాయి. ఒక వెర్రి బ్రాహ్మణుడు పెళ్ళిచూపులకని వస్తూ దారిలో అమ్మాయివెంటపడి చెంపదెబ్బ తింటాడు. పెళ్ళి చూపుల్లో ఇంకో బ్రాహ్మణుడు జ్యోతిష్యమంటూ వెకిలిగా ప్రవర్తిస్తాడు. ఒక దుష్టబ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు పిండాలుపెట్టటమే వచ్చని అంటాడు. వాడి దగ్గర వున్న శిష్య బ్రాహ్మణులూ వెకిలిగానే వుంటారు. కాబట్టి నా సిద్ధాంతం నిరూపితమయిపోయింది, అన్నాడు గంభీరంగా.

కాదని వాదిస్తే ఏమి మూదుతుందోనని మౌనంగా వుండిపోయా. మన దేశంలో కులం సున్నితమయిన సమస్య అని బుధగ్రహంవాడికి ఎలా చెప్పి చచ్చేది? ఇంతకీ కథ చెప్పు అనడిగా వాడి దృష్టిని బ్రాహ్మణ సిద్ధాంతం నుంచి మరల్చేందుకు.

ఇంక కథేముంది, వీరుడు నాయికకు ఒక చిలుకను బహుమతిగా ఇస్తాడు. అబ్బ ఎంత గొప్పగా ఇస్తాడనుకున్నావు. చిలకను తెస్తూంటే ఏమో అయిపోతుందనిపించింది. చిలకను క్లోసప్పులో చూపి గిర గిర తిప్పుతూంటే, హీరో నడకను స్లో మోషన్ లో చూపిస్తూంటే నాకు ఆ అర్ధంకాని సీనుకు ఒళ్ళు పొంగిపోయింది.

ఈ క్లొసప్పులు, స్లో మోషన్లేమిటో అర్ధం కాలేదు. చిలక బహుమతిలో గొప్పేమిటో తెలియలేదు. కానీ పండిత సభలో మౌనమే భూషణం కదా!

పక పకా నవ్వాడు బ్రహ్మ బుధ్. చిలకను నాయికకు ఇచ్చే దృష్యం చమత్కారంగా వుంటుంది. నాయిక ఏదో కథ చెప్తూంతుంది. నాయకుడు వస్తాడు. కథ చెప్తూన్న ఆమె జాకెట్ ముడి వదులయిపోతుంది. అబ్బ ఎంత గొప్ప వూహ! మీ భూగ్రహ స్త్రీలు, అంటూ నాకు అర్ధం కాని బుధవరుల పదమేదో వాడాడు.

అమ్మె ముడి వూడటం గమనించదు. కథ చెప్పటంలో తన్మయమయి చెలికత్తెలు వెళ్ళిపోవటం గమనించదు. మీ భూగ్రహ స్త్రీల ఏకాగ్రత ప్రశంశనీయం. ఎవరూ వినకున్న కథ చెప్తారు. కళ్ళు తెరచి వున్నా ఏమీ చూడరు. వీరుడు నాయిక వెనక చేరి ముడి వేస్తాడు. అబ్బ ఎంత గొప్ప చమత్కార భరిత సృంగార సృజననో! తన్మయుడయిపోయాడు బ్రహ్మబుధ్.

బుధగ్రహ వాసికి కనబడిన చమత్కారమూ, శృంగారమూ భూగ్రహ వాసినయిన నాకు కనబడలేదు.

ఆ తరువాత చూడూ నాయకుడు నాయికల పెళ్ళి అవుతుంది. అవునూ శోభనం నాలుగు గదుల నడుమ చేస్తారా, బట్టబయలున ఒక పదిమంది నృత్యం చేస్తూంటే పాట పాడుతూ చేస్తారా? ఇదే నాకు కాస్త అర్ధంకాలేదు. గంభీరంగా అడిగాడు బ్రహ్మ బుధ్.

నీళ్ళు నమిలా. మాట బయటకు రానీయలేదు.

ఇంక నాయకుడు అదే మన వీరుడు ఒక పదవి పొందుతాడు. అదేమిటో. కానీ రాజు కన్నా ఎక్కువ భోగాలు, అధికారాలు అనుభవిస్తాడు. ఇదే కాలానిదో తెల్;ఇయదు కానీ, కమ్యూనిజాలూ, సోషలిజాలూ పాఠాలు చెప్పేస్తాడు. ఇది నచ్చని రివిజనిస్టులు అతడిని చంపాలని చూస్తారు. ఒక అమ్మాయి వెనుకబడుతుంది. ఆమెని చూపిస్తూంటే ఏదో జరుగుతుందనుకుంటాం. ఎంత సస్పెన్స్ సీన్లో. అడవిలో ఆమె నాయకుడి చేయిపట్టిలాగుత్రుంది. వెనకనుంచి కర్రతో వీరుడి తలమీద బాది నీళ్ళలో పడేస్తారు. నిశ్శబ్దమయిపోయాడు బ్రహ్మబుధ్.

అది తుఫానుముందరి ప్రశాంతత ఏమోనని భయపడ్డా.

ఇదే నాకు అర్ధం కాలేదు. అంతవరకూ తెలివిగా వున్న వీరుడు తలమీద దెబ్బ తగలగానే మతి భ్రమించినట్టయిపోతాడు. నీళ్ళలో తేలి తేలి పక్కనే వున్న ఒక ముసలామెకు దొరుకుతాడు. ఇదే నాకు అర్ధం కాలేదు. అంత సేపు నీళ్ళలో తేలినా ఎంతో దూరం ఎందుకని వెళ్ళలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ముసలామె దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళెక్కడున్నారు? వీళ్ళేక్కడున్నారు? ఈ స్పేస్ నా బుర్రకందటంలేదు.

ఇంతకీ వీరుడు పిచ్చోడయి ఏమి చేస్తాడు? అడిగా.

నా వైపు గుడ్లురిమి చూశాడు. పిచ్చోడయి ఏమి చేస్తాడు. పిచ్చిగా ప్రవర్తిస్తాడు. రాయిని దేవుడంటాడు. రాయి తడుస్తోందని తానూ తడుస్తానంటాడు. పిచ్చి పిచ్చిగా పాటలుపాడతాడు. రామ జన్మ భూమి ఉద్యమంలోం వారిలా గుడి కడతానని ఊరూరా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి డబ్బులు వసూలు చేస్తాడు. అయినా సరిపోవు. పిచ్చివాడు కద్దా డబ్బులను వ్యర్ధంచేస్తాడు. కానీ కర్ర దెబ్బలకు పిచ్చివాడయ్యే వీరుడు ఎలాంటి వీరుడా అని ఆలోచిస్తున్నాను.

ఆలోచిస్తూ చాలా సేపు మౌనంగా వున్నాడు. చివరికి అన్నాడు, నా మీసాల వీరుడు అలా రాతివెంటపడి, కర్ర దెబ్బకు ఎలాంటి కారణం లేకుండా పిచ్చోడవటం నాకు నచ్చలేదు. అని లేచిపోయడు.

బ్రతుకు జీవుడా అనుకుని నిద్రకుపక్రమించా. కానీ బ్రహ్మబుధ్ ను అంతగా కలవర పరచిన ఆ చిత్ర రాజమేమిటో నాకు తెలియటంలేదు. మీకయినా తెలిస్తే చెప్పరూ. అప్పుడయినా నాకు నిద్రపడుతుందేమో. అలాగే మీరంతా కలసి సినిమాలు చూడవద్దని బ్రహ్మ బుధ్ కు చెప్పరా! ఆ సినిమా కథలు వింటూంటే నాకు పిచ్చెకుతుందనిపిస్తోంది.

నవంబరు 22, 2008

నేను చదివిన మంచి పుస్తకం-15

ప్రచురించిన వర్గము pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 12:34 పూర్వాహ్నం

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు  an idealist’s view of life అని ఒక పుస్తకం రాశారు. ఆ కాలాంలో ప్రపంచంలో ప్రచలితంలో వున్న అనెక ఆదర్శవాదాలను, హైందవ ఆదర్శాలనూ పోలుస్తూ సమవయంచేస్తూ రచించిన ఆ పుస్తకం ఆ కాలంలో అనేకుల ఆలోచనలను ప్రభావితం చేసింది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. గోపీచంద్, బుచ్చిబాబు వంటి రచయితలు తమపై అమితంగా ప్రభావం చూపిన పుస్తకంగా ఆ పుస్తకాన్ని పేర్కొన్నారు. తాత్వికం కాక పోయినా, ప్రస్తుతం ప్రపంచంలో మనిషి గురించి, విశ్వంలో మనిషి స్థానం గురించి ప్రచారంలో వున్న అనేక సిద్ధాంతాలను, ఆలోచనలను, అనేక మతాలలఒ మనిషి గురించి వున్న సిద్ధాంతాలను, వైఙ్నానిక ద్రుక్పథాలను విశ్లేషించి, కలిపి చర్చించి, సమన్వయపరస్తూ జాన్ గ్రే రచించిన పుస్తకం  straw dogs.

జాన్ గ్రే యూరోపియన్ ఆలోచనల అధ్యాపకుడు. ఈయన తాత్విక అమ్షాలను, సామాజిక, మానిసిక సిద్ధాంతాల ఆధారంగా వివరిస్తూ నూతన ఆలోచనలకు నాందీ ప్రస్తావన చేయటంలో సిద్ధహస్తుడు. ఏయన రచనలలో false dawn అత్యంత ప్రాచుర్యం పొందింది. 12 భాషలలొకి అనువాదితమయింది.

స్ట్రా డాగ్స్ పుస్తక్మ్ పేరు క్రింద  thoughts on humans and other animals అని పుస్తక లక్ష్యం స్పష్టంగా వుంటుంది.

మనిషీ జంతువే అయినా జంతువుల కన్నా వున్నతుడు తాను అన్నది మనిషి నమ్మకం. భగవంతుడు తనను ప్రత్యేకంగా సృష్టించాడనీ, తన జీవితానికి అంతిమ లక్ష్యంవుందనీ మనిషి నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా మతాలు, తత్వాలు, అన్నీ ఏ నమ్మకాల ఆధారంగా ఏర్పడ్డాయి. ఏ నమ్మకాల ఆధారంగా నైతిక విలువలు వెలిసాయి. సామాజిక నియమాలు రూపు దిద్దుకున్నాయి. స్వర్గం, నరకం లాంటి భావనలు రూపొందాయి. మొత్తంగా భగవంతుని అత్యుత్తమ స్ర్ష్టి మనిషి అన్న భావన కేంద్రంగా మనిషి ఆలోచనలు ఎదిగాయి.

ఈ ఆలోచనలను పలువురు పలురకాలుగా ప్రదర్శించారు. ఆలోచిస్తున్నాను కాబట్టే నేను వున్నాను అని ఒకరంటే, ఆలోచనలు లేని నిష్చల స్థితే మహదానంద స్థితి అదే మానవుడి అంతిమ లక్ష్యం అని ఇంకొకరు నమ్మారు. ఆలోచనలను నియంత్రించటమే అత్యున్నతం అని ఒక విశ్వస్శిస్తే, విచ్చలవిది ఆలోచనలే అత్యద్భుతమని ఇంకోకరు భావించారు.

ఇలా విభిన్నమయిన ఆలోచనలు మానవ చింతనలో మనిషి గురించి వ్యక్తమవుతాయి. అయితే, ఇంతకీ మనిషి ఎవరు. ఏ అనంత విశ్వంలో మానవుది పాత్ర ఏమితి? నిజంగా భగవంతుదు, స్వర్గ నరకాలు, నీతి నియమాలు, పరమానంద స్థితిలాంతివి వున్నాయా?

ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ, విభిన్న ఆలోచనలను విశదపరుస్తూ, నిగూఢమయిన తాత్విక చింతనలను తేట తెల్లం చేస్తూ, తార్కికంగా, సహేతుకంగా తన వాదననీ పుస్తకంలో పొందుపరచాడు జాన్ గ్రే.

మనిషి సృష్టికి కేంద్రం అన్నది క్రీశ్టియన్లనీ దానివల్ల మానవ సమాజం ఎంతగా భీభత్స మయిపోయిందో నిరూపిస్తాదు. బఔద్ధ, హైందవ, టఒ, తో సహా అనేక తత్వవేతాల సిద్ధాంతాలను విశ్లేషిస్తాడు. స్పినోజా, షోపెణాయిర్, దెకార్తే, అరిస్టాటిల్, ప్లాటో ల ఆలోచనలను పరిచయం చేస్తూ వివరిస్తాడు. క్రీస్టియన్ మతం బోధించిన ఆలోచన వల్ల మానవుది rational ద్రుక్పథం ఎలా వికృతమయిందో వివ్వరిస్తాడు. అలాగే, బుద్ధుది ఆలోచనలెలా మనిషిని సంతృప్తి పరచలేవో నిరూపిస్తాడు. తత్వ వేత్తల ఆలోచనలలో లోపాలను, వారి ఆలోచనా రీతులపైన ప్రభావాలను చర్చిస్తాడు.ఈ పుస్తకం ద్వారా జాన్ గ్రే మనిషి జంతువేననీ ఏమాత్రం భిన్నం కాడనీ నిరూపిస్తాదు. మనిషికి ప్రత్యేకమయిన ఆత్మ శక్తి వుందనీ, ఇచ్చా శక్తి వుందనీ అనుకోవటం అహంకారమని చూపిస్తాడు. మనిషి తాను సృష్టించుకున్న నైతిక విలువల ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడో వివరిస్తాడు. అంతేకాదు, ఎవరో ప్రవక్తలు రక్షించటం, ముక్తి, మోక్షం లాంటి భావనలను ఖండిస్తాడు. సాంకేతిక పరిఙ్నానం ఎలా అమ్నిషిని అసంతృప్తిలోకి నెడుతూ అతది జంతు ప్రవృత్తిని ప్రకోపిస్తోందో చూపిస్తాడు.

2002 లో రచించిన ఈ పుస్తకంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అనేక సమస్యలు, వాటికి కారణాలు వివరిస్తాడు. ముఖ్యంగా ఆర్ధిక సన్కోభాన్ని ఊహించి వివరిస్తాడు. అది ఇప్పుదు నిజమయింది. ఇలా అంతులేని ఆలోచనలను రేకెత్తిస్తూ, వివిధ సిద్ద్ధాంతాలను ఆలోచనా విధానాలను వివరైస్తూ సాగే ఈ పుస్తకం అత్యంత ఆసక్తికరంగా వుంటుంది. ఒక కాల్పనికేతర రచన, అదీ క్లిష్టమయిన ఆలోచనలను వివీరించేరచన చదువుతున్నామన్న భావన కలగదు. మంచి సస్పెన్స్ రచన చదువుతున్నాతూ వుంతుంది. రచయిత ఆలోచనలతో మనం ఏకీభవించకపోయినా అతని ఆలోచనల లోతు మనల్ని మెప్పిస్తుంది. వాటిని ప్రదర్శించిన తీరు అలరిస్తుంది. అందుకే  ఇది అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో చేరుతుంది. మానవుడి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుందీ పుస్తకం.

ఈ పుస్తకం పేరు గురించిన వివరణ కూడా వుంది.

చైనీయులు ఒక పండుగలో గడ్డితో కుక్కలను చేస్తారు. ఆ కుక్కలను దైవంలా భావించి గఔరవిస్తారు. పూజిస్తారు. పూజలయిన తరువాత పక్కన పారేస్తారు. పట్టించుకోరు. ఈ విశ్వంలో మనిషీ అలాంటి గడ్డికుక్కలలాంటి వాడంటాడు రచయిత.

ఈ విశ్వం జీవమున్న జీవిలాంటిదని, మనిషి వల్ల ఏమాత్రం నష్టం కలిగినా మనిషిని పక్కకునెట్టి ముందుకు సాగిపోతుందన్నది రచయిత అభిప్రాయం. ప్రకృతి మనిషి కోసం వున్నదని, జంతువులు మనిషికన్న తక్కువానుకోవటం పొరపాటన్నది రచయిత నమ్మకం. తానే సృష్టి కేంద్ర అనుకోవటం మనిషి అహంకారని, ఇతర జీవుల్లంటివాడే మనిషని ఈ పుస్తకంలో తన వాదనద్వారా నిరూపిస్తాడు రచయిత.

2002లో granta books ఈ పుస్తకాన్ని ప్రచురించింది. వెల 12.99 పౌండ్లు.

నవంబరు 17, 2008

ఉఫ్ఫ్ కిత్నీ ఠండీ హై – చలి పాటలు.

ప్రచురించిన వర్గము sinemaa vishleashaNaa. — కస్తూరి మురళీకృష్ణ @ 12:22 పూర్వాహ్నం

ఇంకో గంటలో నాందేడ్ వెళ్ళే రైలు ఎక్కాలి. అదేమిటో ఆఫీసులో సమయం గడవదు. ఇంట్లో సమయం నిలవదు. కన్ను మూసి తెరిచేలోగా కాలం కరగిపోతూంటుంది. శని వారం వచ్చా. ఇంకా విశ్రాంతి తీసుకున్నట్టే లేదు అప్పుడే మళ్ళీ రైలెక్కే సమయం దగ్గరపడింది.

బయలుదేరే సమయం దగ్గర పదుతున్నకొద్దీ అదేదో గుబులు గుండెలో. వెళ్ళాలనిపించదు. వెళ్ళకతప్పదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆర్డరు ఏ క్షణాంలో నయినా రావచ్చు. రాగానే పరుగెత్తుకుంటూ వచ్చేయవచ్చు. అందుకని అతి అయిష్టంగా తయారవుతున్నా.

నేను చిన్నప్పుదు బడికి వెళ్ళేఅందుకుకూడా ఇంతగా బాధ పెట్టలేదని అమ్మ ఏడిపిస్తోంది. అవును, బడికి వెళ్ళేఅందుకు ఎందుకేడుస్తాను, మా అమ్మే టీచర్ కదా. అమ్మతో వెళ్ళేఅవాడిని. అమ్మతో వచ్చేవాడిని. బడి ఇంటికి extension లా వుండేది. కానీ, నాందేడ్ నరకానికి extension.

బయట చాలా చల్లగా వుంది. ఎంత చల్లగా అంటే నాకు నా హిమాలయాల ట్రెక్కింగ్ గుర్తుకు వస్తోంది. కానీ అది ఆనందకరమయిన అనుభవాలు. ఇది కాదు.

మనసుకు నచ్చని పనులు చేసేటప్పుదు, నచ్చిన పనులను స్మరించాలంటారు. దాంతో మనసు మళ్ళుతుంది. అయిష్టమయిన పనులు ఇష్టమయిన ఆలోచనలతో చేసేస్తాము. అందుకే నా మనసును చలి పాటలవైపు మళ్ళించాను. అప్పుడో విషయం గమనించా.

మన సినిమాలు వాన కిచ్చిన ప్రాధాన్యం చలికి ఇవ్వలేదు. వానపాటలనగానే వెంటనే వెయ్యి గుర్తుకువస్తాయి. చలి అనగానే ఒక్క సారి మెదడు గడ్డకట్టినట్టయింది. బొటాబొటీగా పాటలు గుర్తుకువస్తున్నాయి.

ఠండీహవాయే అన్న సాహిర్ గీతం ఝల్లుమనిపించింది.

ఠండి హవా కాలిఘటా అన్న మజ్రూహ్ గీతం, ఠండి హవా కాలిఘటా అన్న సాహిర్ గీతాలు రెండూ గుర్తుకువచ్చాయి.

ఠండి ఠండి హవామె దిల్ లల్చాయ్, హాయే జవానీ దీవానీ అన్న శంకర్ జైకిషన్ breezee పాట గుర్తుకువచ్చింది.

ఠండి హవా యె చాంద్నీ సుహానీ అంటూ తెల్లారే కిషోర్ కుమార్ మాధుర్యాన్ని చిలికించాడు.

ఠండే ఠందే పానీసే నహానా చాహియే అంటూ మహేంద్ర కపూర్ ఉచిత సలహా పారేశాడు. ఆయనదేం పోయింది, వణుకుతూ స్నానం చేయాల్సింది నేనుకదా!

ఇంతలో ఒక అధ్బుతమయిన అసలు చలిపాట గుర్తుకువచ్చింది.తీన్ దేవియా అనే సినిమాలో సిమి, దేవానంద్ లు చలికి వణుకుతూ ఉఫ్ఫ్ కిత్నీ ఠందీ హై నరం, సుంతీ హై తణాయీ మెరీ, సంగ్ సంగ్ జల్తా హై బదన్, కాంపేహై అంగ్డాయీ మెరీ అంటూ లతా, కిషోర్ ల గొంతులో నిజంగా చలికి వణకుతున్నాట్టే పాడతారు. నిజానికి మిగతా అన్ని పాటల్లో చలి అన్న పదం ఉన్నా, నిజంగా చలి ఉన్నదీపాటలోనే. చలికి వణుకుతూ నాయికా నాయకులు హత్తుకుపోతూంటే గాయనీ గాయకులు intimate conversation లా పాట పాడుతూంటే వింటూంటేనే చలిగా, మధురంగా వుంటుంది. దుప్పటి కప్పుకుని వెచ్చగా వినాల్సిన పాట ఇది.

అయితే నిజంగా వణుకు పుట్టించేపాట చలి చలిగా వుందిరా హొయ్ రామా హొయ్ రామా అన్నది.

ఈ పాట గుర్తుకురాగానే చలి పెరిగిపోయింది. మెదడులోంచి పాటలెగిరిపోయాయి. ఎగురుతూన్న ఎంటీరామారావు గుర్తుకువచ్చాడు. ఖతం పరుగెత్తాలని గుర్తుకువచ్చింది.

కానీ, గమనిస్తే, మన సినిమాలవారు ఎంతో romantic, erotic అయిన చలిపయిన శీతకన్నేశారనిపిస్తుంది. లేకపోతే వానపైన అన్నిపాటలుంది అసలయిన చలిపాటనొకదాన్నే సృజించటం చలికి అన్యాయమేకదా!

ఈ ఆలోచనతో నాందేడ్ వెళ్తున్నాను. అక్కడ వీలు చిక్కితే మళ్ళీ కలుస్తాను. లేకపోతే….ఖుదా ఆప్సే కిసీ దిన్ మిలాయే, బహుత్ షుక్రియా బడీ మెహెర్బానీ!

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.