ఆర్థర్ సి క్లార్క్ మరణించాడు.తాను స్రుజించిన రచనలలో ప్రదర్షించిన ఊహలన్నీ నిజమవటం చూస్తాడని నమ్మకంగా అనుకుంటూంటే అనూహ్యమయిన రీతిలో క్లార్క్ మరణించాడు.పుట్టింది బ్రిటన్లో నయినా క్లర్క్ విశ్వమానవుడు.ఎల్లలు లేనివి అతని రచనలు.విశాల విశ్వంలో విచ్చలవిడిగా విహరించాయి అతని వూహలు.అయితే అతని వూహలన్ని వైఙ్నానిక సిద్ధాంతాల ఆధారంగా ఎదిగినవే.తన జీవిత కాలంలో ఎన్నో ఊహలు నిజమయి ప్రపంచంలో జన జీవితంలో విడదీయరాని భాగమవటం ఆయన చూశారు.ఇంకా మానవుడు అందని ఆకశం వయిపు ఆశగా చూస్తూన్నప్పుడే ఆయన భూమి చుట్టూ నిర్ణీత కక్షలో తిరుగుతూ తరంగాల ద్వార సమాచారాన్ని అందించే ఉపగ్రహాల ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదన ఆధారంగా పరిశోధనలు చేసి శాశ్త్రవేత్తలు ఉపగ్రహాలకు రూపకల్పన చేశారు.ఆకాశంలో విహరించాలన్న అయన కోరిక అతడిని సైన్స్ ఫిక్కన్ రచయితగ మలచింది.2001 స్పేస్ ఒడిసి ఈనటికీ సైన్స్ ఫిక్షన్ సినెమా లకు ప్రామాణికం.రెండవూ విత్ రామా అద్భుతమయిన రచన.ఇతర రచయితలకు భిన్నంగా గ్రహాంతర వాసులను ఆయన శత్రువులలా చూడలేదు.ఆయన ద్రుశ్టిలో వారూ మనలాగే స్నేహ హస్తాం సాచే వారు.ఆయన ప్రతిరచనలో అనేక వైఙానికాంశాలు పఠకులకు తెలుస్తాయి.సామాన్యులే కాదు శాస్త్రవేత్తలు కూడా ఆయన రచనల కోసం ఎదురుచూసేవారు.తన రచనలలో ఆయన ప్రతిపాదించిన సిధాంతాల ఆధారంగా పరిశోధనలు చేసేవారు.అందుకే అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయనను గౌరవించారు.ఆయన శ్రీలంక లో స్థిరపడ్డారు.మన దేశంలో ఉపగ్రహ ప్రసారాలు ఆరంభమయ్యే సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్ క్లార్క్ కు డిశ్ ను గౌరవ సూచకంగా సమర్పించాడు.అమెరికన్లు చంద్రమండ్ల ప్రయోగాలు చేసెటప్పుదు క్లార్క్ను గౌరవ అతిథిగా పిలిచారు.క్లార్క్ కు అంతరిక్షంలో విహరించాలని ఎంత కోరికగా వుండేదంటే సముద్రగర్భంలో పరిశోధిస్తూ అంతరిక్షంలోని భారరహితస్థితిని అనుభవిస్తున్నననుకును ఆనందించేవాదు.అతిగా సముద్రంలో వుండటంవల్ల అయన కళ్ళు దెబ్బతిన్నాయి.అయిన అతడి పరిశోధనాసక్తి తగ్గలేదు.ప్రపంచమానవుల నడుమ శంతిని అవగాహనను కాన్కించిన క్లార్క్ విశ్వమానవుడు.వైఙానికాంశాల ఆధరంగా భవిశ్యద్దర్శనం చేసిన క్లార్క్ ద్రశ్త.సైన్స్ ఫిక్షన్ కు శాస్త్రవేత్తల గౌరవం లభించేట్టు చేసి సహిత్యంలో ఉన్నత స్థనన్ని ఆపదించిన క్లార్క్ నిజంగా ద్రశ్టనే.అతడికి నా నీరాజనాలు.